*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి, నాలుగేళ్ల కుమారుడు మృతి*
ఆగస్టు 13, 2026 |
మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం పిల్లిగుండ్లతండా గ్రామపంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి భూక్యా మౌనిక (34), ఆమె నాలుగేళ్ల కుమారుడు మృతి చెందారు.
తల్లి, కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పిల్లిగుండ్లతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

