ఆరు నెలల గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కిరాతక భర్
అల్వాల్, సెప్టెంబర్ 14 (దేశ టైమ్స్): అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల గర్భిణీ భార్యను భర్త గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అల్వాల్ సూర్యనగర్కు చెందిన శివానిని ఏడాది క్రితం పరశురామ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్న పరశురామ్ ఆదివారం రాత్రి మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆరు నెలల గర్భిణీ అయిన శివాని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం శివాని బాత్రూంలో జారిపడిందని కుటుంబ సభ్యులను నిందితుడు నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు పరశురామ్ను విచారించగా, తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

