24.3 C
Hyderabad
Monday, September 14, 2026

తెలంగాణలో పెన్షన్ల జాతర

Must read

📰 Generate e-Paper Clip

గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేద, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సామాజిక భద్రత పింఛన్లకు అర్హులైన పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులకు ఆయా నిబంధనల ప్రకారం నెలవారీ ఆర్థిక సాయం అందించనున్నారు.

అర్హత కలిగిన వారు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని తమ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి లేదా గ్రామ సర్పంచ్‌కు దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు సంబంధిత డేటాబేస్‌ల ద్వారా వెరిఫికేషన్ నిర్వహించిన అనంతరం అర్హతను బట్టి పింఛను మంజూరు చేస్తారు.

పింఛను రకాలు – నెలవారీ ఆర్థిక సాయం:

..వికలాంగుల పింఛను: నెలకు ₹4,016

..వితంతు మహిళల పింఛను: నెలకు ₹2,016

..ఒంటరి మహిళల పింఛను: నెలకు ₹2,016

..కల్లు గీత కార్మికుల పింఛను: నెలకు ₹2,016

..చేనేత కార్మికుల పింఛను: నెలకు ₹2,016

 

..ఫైలేరియా బాధితుల పింఛను: నెలకు ₹2,016

 

.. డయాలసిస్ బాధితుల పింఛను: నెలకు ₹2,016

 

వితంతు మహిళలకు అర్హతలు:

 

భర్తను కోల్పోయిన 18 సంవత్సరాలు పైబడిన మహిళలు వితంతు పింఛనుకు అర్హులుగా పరిగణించబడతారు. దరఖాస్తు సమయంలో భర్త మరణించినట్లు నిర్ధారించే మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి

ఒంటరి మహిళలకు అర్హతలు

ఒంటరి మహిళల కేటగిరీలో కూడా నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

విడాకులు పొందిన వారు లేదా భర్త నుంచి విడిపోయి జీవిస్తున్న మహిళలు:

18 సంవత్సరాలు పైబడిన వారు అర్హులు. భర్త నుంచి కనీసం ఒక సంవత్సరం నుంచి విడిగా జీవిస్తున్నట్లు నిర్ధారణ ఉండాలి.

అవివాహిత మహిళలు:

గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు పైబడిన అవివాహిత మహిళలు అర్హత పొందవచ్చు.

వికలాంగుల పింఛను:

వికలాంగుల పింఛనుకు వయోపరిమితి లేదు. కనీసం 40 శాతం వైకల్యం ఉన్న వారు అర్హులు. వినికిడి లోపం ఉన్న వారికి 51 శాతం వైకల్యం ఉండాలి.

వికలాంగుల పింఛను కోసం SADAREM ధృవీకరణ పత్రం లేదా సంబంధిత వైద్య ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలి.

కల్లు గీత, చేనేత కార్మికులకు పింఛను

కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు పైబడిన వారు సంబంధిత నిబంధనల ప్రకారం పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుదారులు తాము సంబంధిత వృత్తిలో ఉన్నట్లు నిర్ధారించే సంబంధిత శాఖ లేదా సొసైటీ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు పింఛను

ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు పింఛను పొందేందుకు వయోపరిమితి లేదు. అయితే సంబంధిత వ్యాధి ఉన్నట్లు నిర్ధారించే వైద్య ఆరోగ్య శాఖ లేదా ఆరోగ్యశ్రీ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.

ఎవరెవరు అనర్హులు?:

సామాజిక భద్రత పింఛన్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, ఆదాయం తదితర అంశాలను కూడా పరిశీలిస్తారు.

అనర్హులు వీరే:

❌ 3 ఎకరాల మాగాణి లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలు.

❌ ప్రభుత్వ, ప్రైవేట్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో పనిచేసే పిల్లలు ఉన్న కుటుంబాలు.

❌ డాక్టర్లు, కాంట్రాక్టర్లు తదితర ప్రొఫెషనల్స్‌గా పనిచేసే పిల్లలు ఉన్న కుటుంబాలు.

❌ పెట్రోల్ బంక్, రైస్ మిల్ లేదా పెద్ద వ్యాపార సంస్థలు కలిగిన కుటుంబాలు.

❌ కారు లేదా ఇతర భారీ వాహనాలు కలిగిన కుటుంబాలు.

❌ గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ₹1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ₹2.00 లక్షలు మించిన కుటుంబాలు.

 

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:

పింఛను కోసం దరఖాస్తు చేసుకునే వారు కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:

 

📌 పింఛను దరఖాస్తు ఫారం

📌 ఆధార్ కార్డు

📌 వయస్సు ధృవీకరణ పత్రం

📌 రేషన్ కార్డు

📌 ఆదాయ ధృవీకరణ పత్రం

📌 బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ

📌 సంబంధిత కేటగిరీ ధృవీకరణ పత్రం

 

అవసరాన్ని బట్టి మరణ ధృవీకరణ పత్రం, SADAREM సర్టిఫికెట్, విడాకుల పత్రం, సంబంధిత శాఖ లేదా సొసైటీ ధృవీకరణ, వైద్య ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఎక్కడ దరఖాస్తు చేయాలి?:

అర్హులైన లబ్ధిదారులు తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో నింపి సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ సర్పంచ్‌కు సమర్పించవచ్చు.

దరఖాస్తు సమర్పించిన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో కుటుంబ పరిస్థితి, ఆదాయం, ఆస్తులు, అర్హతలు తదితర అంశాలను పరిశీలిస్తారు. సంబంధిత ప్రభుత్వ డేటాబేస్‌లలోని వివరాలతో కూడా ధృవీకరణ చేపడతారు.

ముఖ్య గమనిక:

 

పింఛను కోసం దరఖాస్తు చేయడం మాత్రమే పింఛను మంజూరైనట్లు కాదు. క్షేత్రస్థాయి పరిశీలన, డేటాబేస్ వెరిఫికేషన్, సంబంధిత నిబంధనల ప్రకారం అర్హత నిర్ధారణ అనంతరం మాత్రమే పింఛను మంజూరు చేయబడుతుంది.

అర్హత ఉన్న వారు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకుని సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

గమనిక: పింఛన్ల అర్హతలు, పత్రాలు, మంజూరు విధానం సంబంధిత ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు లోబడి ఉంటాయి. దరఖాస్తు చేసుకునే ముందు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో తాజా వివరాలను నిర్ధారించుకోవడం మంచిది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.