*వామ్మో ఎంత దారుణంగా ఉన్నారు…. మనిషి కాదు నర మాంస భక్షకుడు…చెన్నైలో దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండారు!*
చెన్నై
తనకి తోడుగా ఉన్న మహిళను హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి బిర్యానీ వండిన ఘటన కలకలం రేపుతోంది.
ఆగ్రా స్టేషన్లోని ఓ రైలులో దొరికిన సూట్కేస్లోని శరీర భాగాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన చెన్నై పోలీసులు..,
నిందితులైన ఒక మహిళ, పురుషుడిని గుర్తించారు.
వీరిద్దరూ సీసీటీవీల ద్వారా సూట్కేస్ను రైలులో ఉంచినట్లు తేలింది.
గూడువాంచేరిలోని వారి ఇంట్లో వంటగదిలో బిర్యానీ పాత్రలో మహిళ శరీర భాగాలను ఉడికించినట్లు పోలీసులు కనుగొన్నారు.
హత్యకు గురైన మహిళ ఒడిశాకు చెందిన హయూత్ నిషాగా గుర్తించారు.
ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

