నాతాళ్లగూడెం వాసికి డాక్టరేట్ ప్రదానం
వలిగొండ : సెప్టెంబర్ 8( దేశ టైమ్స్)
మండలంలోని నాతాళ్లగూడెంకు చెందిన జూకంటి వెంకటయ్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్ డి డాక్టరేట్ పట్టాను అందజేసింది. మంగళవారం ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ రమణ పర్యవేక్షణలో ఎ రోల్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ గవర్నెన్స్ రూరల్ డెవలప్ మెంట్ అను అంశంపై పరిశోదనపై డాక్టరేట్ ప్రధానం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కుమార్ , చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన భారత్ బయోటెక్ హైదరాబాద్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా చేతుల మీదుగా పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను అందజేసినట్లు ఆయన తెలిపారు.

