*చాటింగ్ చేస్తోందని భార్యను చంపేసి.. మృతదేహాన్ని నదిలో విసిరేసిన భర్త!*
యానాం…
పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందనే అనుమానంతో భార్యను హత్య చేసి నదిలో పడేశాడు భర్త.
యానాం పరిధి కనకాలపేటకు చెందిన చెక్కా అప్పారావు (29).. భీంనగర్కు చెందిన పువ్వల రేఖ (26) ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
శుక్రవారం రాత్రి, భార్య తన ఫోన్లో చాటింగ్ చేస్తుండటంతో గొడవపడి, ఆమె ముఖంపై పిడిగుద్దులు గుద్ది, గొంతు నులిమి చంపేశాడు.
రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాన్ని కోరింగ నదిలో పడేశాడు.
శనివారం భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన భర్త..
పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు నదిలో గాలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

