*ఏపీలో 44.21 లక్షల ఓటర్లకు నోటీసులు..*
*చివరి అవకాశం!!!*
*ఇలా చేయకపోతే ఓటు గల్లంతు*
అమరావతి :
ఏపీలో SIR తర్వాత 44.89లక్షలఓట్లను తొలగించగా, మరో 44.21 లక్షల ఓటర్లకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇస్తోంది. ప్రస్తుత జాబితాలోని కొందరు 2002 నాటి ఓటర్ లిస్టులోని తమ పేరు లేదా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వివరాలతో మ్యాచింగ్ చేయలేదు. అలాగే మరికొందరి వివరాలలో తప్పిదాలు కనిపించాయి. వీరందరికీ నోటీసులు వెళ్లాయి. సెప్టెంబర్ 28వ తేదీలోగా వీరు వారి పరిధిలోని BLOలను కలిసి వివరాలు సరిచేసుకోవాలి. అప్పుడే ఫైనల్ లిస్టులో వారి పేర్లు కొనసాగిస్తారు. లేదంటే వారి పేర్లును ఓటరు జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తారు.

