తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్స్ శిరీష అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రి సిబ్బందిని విచారిస్తూ, శిరీష మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.
ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు శంషాబాద్ డీసీపీ రాజేష్ ఆస్పత్రికి చేరుకున్నారు. నర్స్ శిరీష మృతి వెనుక అసలు కారణమేంటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
🔴 నర్స్ మృతిపై మిస్టరీ.. అసలు ఏం జరిగింది?

