DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 2:12 am Posted by : DESHA TIME

విలేఖరి వలిని పరామర్శించిన టీ జె ఏ జిల్లా అధ్యక్షుడు షానూర్.

విలేఖరి వలిని పరామర్శించిన టీ జె ఏ జిల్లా అధ్యక్షుడు షానూర్.

 

 (యాదాద్రి కరెస్పాండెంట్)

 దేశ టైమ్స్,ఆగస్టు 31 

 

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలానికి చెందిన సూర్య దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ నాగేల్లి వలి తండ్రి నాగేల్లి రాములు ఇటీవల అనారోగ్యంతో మరణించగా 

  విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు, మీడియా అక్రిడెషన్ కమిటీ సభ్యులు మొహమ్మద్ షానూర్ బాబా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వము కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

వారితోపాటు టీ జె ఏ ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,జిల్లా కార్యదర్శి యానాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.