DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 5:12 pm Posted by : DESHA TIME

తిరుపతిలో విషాదం

*తిరుపతి…బ్రేకింగ్.*

 

*తిరుపతిలో విషాదం.*

 

సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరు మృతి.

 

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బిఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఘటన.

 

మృతులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్ రాజ్ (36),నరేష్ (21) గా గుర్తింపు.

 

సెల్ ఫోన్ పడిపోయిందని దుప్పట్లు కట్టుకొని బావిలోకి దిగిన భీమ్ రాజ్, అతడు రాకపోయేసరికి కాపాడే ప్రయత్నంలో నరేష్ బావిలోకి….

 

విషవాయువులు పీల్చడంతో అక్కడే మృతి చెందిన వైనం.

 

అలిపి పోలీసులకు సమాచారం అందడంతో బావి దగ్గరకు చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది పోలీసులు.

 

విషవాయువులకు భయపడి ఫైర్ ఇంజన్ సిబ్బంది బావిలోకి దిగకుండా పాతాలబేరి సహాయంతో మృతదేహాలను వెలికితీత.

 

మృతదేహాలను రూయ మార్చురీకి తరలింపు.

 

ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరి సిఐ రామ కిషోర్.