*యూకేలో చీలికలు? స్వాతంత్య్రం దిశగా మూడు ప్రాంతాలు!
యునైటెడ్ కింగ్డమ్ భవిష్యత్తుపై కీలక చర్చకు రంగం సిద్ధమైంది. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్లు కార్డిఫ్లో సమావేశమై స్వీయ నిర్ణయాధికారం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో స్వాతంత్య్రం పొందే హక్కుపై ఉమ్మడి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘భవిష్యత్తులో యూకే ప్రభుత్వం ఎదుర్కోబోయే మార్పులకు సిద్ధంగా ఉండాలి’’ అని పేర్కొంటూ.. స్కాట్లాండ్ స్వాతంత్య్రం అంశమే తమ చర్చలకు ప్రధానంగా ఉంటుందని స్పష్టం చేశారు.
స్కాట్లాండ్లో మరోసారి స్వాతంత్య్ర రెఫరెండంపై యూకే ప్రధాని ఆండీ బర్న్హామ్ చేసిన వ్యాఖ్యలు, ఐర్లాండ్ పునరేకీకరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.