DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 2:29 pm Posted by : DESHA TIME

మధ్యప్రదేశ్* *కల్తీ మద్యం తాగి 12 మంది మృతి.. 6 షాపులు సీజ్*

*మధ్యప్రదేశ్*

 

*కల్తీ మద్యం తాగి 12 మంది మృతి.. 6 షాపులు సీజ్*

 

మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో నివారం అర్ధరాత్రి ‘బాంబే విస్కీ’ అనే కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. మరో 10 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో మిథైల్ ఆల్కహాల్ విష లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అధికారులు 6 మద్యం దుకాణాలను సీజ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.