గాజువాక షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదన్న కారణంతో రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి వాహనాన్ని ఓవర్టేక్ చేసినట్లు ఆరోపణలు. అనంతరం ఇన్స్పెక్టర్ సమక్షంలో ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్పై రక్తం వచ్చేలా పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధమవుతున్నారు.