DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 10:31 am Posted by : DESHA TIME

*మయన్మార్‌లో విషాదం.. బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది..!!* 

  • *మయన్మార్‌లో విషాదం.. బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది..!!*

మయన్మార్‌లో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ సగయింగ్ ప్రాంతంలోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైనిక ప్రభుత్వం జరిపిన వైమానిక దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 20 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆశ్రమంలో ధ్యాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో శుక్రవారం ఈ దాడి జరగడం పెను విషాదాన్ని నింపింది.

 

మ్యౌంగ్‌ టౌన్‌షిప్‌లోని స్వెల్‌ లే ఓ గ్రామంలో ఉన్న బౌద్ధ ఆశ్రమంలో వారం రోజుల ధ్యాన శిబిరం కొనసాగుతోంది. శుక్రవారం భక్తులు ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో సైనిక విమానం ఆశ్రమాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడినట్లు మ్యౌంగ్‌ టౌన్‌షిప్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి వెల్లడించారు.