హైదరాబాద్: ఫోన్లో అర్ధరాత్రి వరకు మాట్లాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని తేజస్వి (17) ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఛత్రినాకకు చెందిన శ్రీనివాస్ కుమార్తె తేజస్వి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. నిత్యం అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించిన తండ్రి ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన తేజస్వి అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
కుమార్తెను గమనించిన శ్రీనివాస్ ఆమెను అనుసరించగా.. ఉప్పుగూడ వద్ద వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి తేజస్వి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.