DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 4:51 pm Posted by : DESHA TIME

MP కొడుకు ర్యాష్ డ్రైవింగ్ ! యువతి దుర్మరణం !

  • MP కొడుకు ర్యాష్ డ్రైవింగ్ !
  • యువతి దుర్మరణం !!!

ఆగస్టు 16న హైదరాబాద్ ఇన్‌ఆర్బిట్ మాల్ లో పనిచేసే 26 ఏళ్ల భారతి ముఖిని అస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 

అయితే, కారు నడిపింది ఏపీకి చెందిన రాజ్యసభ MP లింగమనేని రమేష్ కొడుకు 21 ఏళ్ల సంజుష్ అని పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి యువతి ప్రాణం తీసిన సంజుష్ పై BNS 106(1) కింద కేసు పెట్టారు. 

 

కానీ, MPకి దగ్గరి స్నేహితుడైన ఓ కాంట్రాక్టర్ చొరవతో ఇంకా అరెస్ట్ చేయలేదని ప్రచారం జరుగుతోంది.