DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 2:04 pm Posted by : DESHA TIME

సాఫ్ట్‌వేర్, సేవల ముసుగులో విదేశాలకు నిధులు

సాఫ్ట్‌వేర్ దిగుమతి, కన్సల్టింగ్ సర్వీసెస్, సరుకు రవాణా (ఫ్రైట్) పేర్లతో గత మూడేళ్లలో భారీగా డబ్బును ఇతర దేశాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఐటీ రిటర్న్లు దాఖలు చేయని వారు, నామమాత్రపు లావాదేవీలు చూపించే డొల్ల కంపెనీలు (Shell Entities) ఈ పనిలో ఉన్నాయి. దేశ సరిహద్దు రాష్ట్రాల్లోని 117 సంస్థలతో కలిపి మొత్తం 394 అనుమానాస్పద కంపెనీలపై అధికారులు గురిపెట్టారు.ఈ తరహా మోసాలపై సీనియర్ టాక్స్ అడ్వైజరీ నిపుణులు మాట్లాడుతూ.. “బోగస్ ఎంట్రీల ద్వారా అక్రమ సొమ్మును చట్టబద్ధమైన వ్యాపార ఖర్చులుగా చూపిస్తూ విదేశాలకు తరలించే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రత్యక్షంగా పన్ను ఎగవేత కిందకే వస్తుంది” అని పేర్కొన్నారు.