బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం
ఆగస్టు 25: (దేశ టైమ్స్)
వలిగొండ : మండలంలోని వేములకొండకు చెందిన కందుకూరి రాజు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఆయనతో 10 వ తరగతి చదువుకున్న తోటి పూర్వ విద్యార్థుల సౌజన్యంతో 30 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబటి సాయి కుమార్, బొద్రబోయిన దయాకర్, కాడిగళ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.