ఎస్ఐ పేరుతో సైబర్ మోసం.. రూ.78,500 టోకరా!

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో సైబర్ కేటుగాళ్లు ఎస్సై పేరుతో వైన్స్ ఉద్యోగిని నమ్మించి ఏకంగా రూ.78,500 కాజేశారు. తాను ఎస్సైగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన డ్రైవర్ రూ.25 వేల నగదుతో వస్తున్నాడని, అందుకు బదులుగా క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపాలని చెప్పాడు. నమ్మిన బాధితుడు రెండు రోజుల్లో విడతలుగా రూ.78,500 పంపించాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే 1930కు ఫిర్యాదు చేశాడు. ⚠️ అపరిచితుల ఫోన్ కాల్స్, QR కోడ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి. #CyberCrime #CyberFraud #Mahabubabad #Nellikuduru #TelanganaNews...