DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 9:22 am Posted by : DESHA TIME

తిరుపతిలో బాలికపై బ్లేడ్‌తో దాడి.. గతంలో యాసిడ్ దాడి?

తిరుపతి జీవకోనలో 16 ఏళ్ల బాలికపై బ్లేడ్‌తో దాడి ఘటన కలకలం రేపింది. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

దాడిలో గాయపడిన బాలికను స్థానికులు రక్షించి రుయా ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ బాలికపై యాసిడ్‌తో హత్యాయత్నం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

తాజా దాడికి కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

#Tirupati #CrimeNews #BreakingNews #AndhraPradesh #DeshaTimes