బేగంపేటలోని ఫార్చ్యూన్ మనోహర్ హోటల్కు చెందిన చైర్మన్ మనోహర్తో పాటు ముగ్గురు మేనేజర్లపై ఉద్యోగిని ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు చైర్మన్ క్యాబిన్లో రూ.లక్ష నగదు చోరీకి గురైందంటూ హోటల్ సిబ్బంది గతంలోనే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#Begumpet #Hyderabad #CrimeNews #PoliceInvestigation #DeshaTimes